టీఆర్‌ఎస్‌ నేతల లొల్లి

ABN , First Publish Date - 2020-11-30T05:29:53+05:30 IST

టీఆర్‌ఎస్‌ నేతల లొల్లి

టీఆర్‌ఎస్‌ నేతల లొల్లి

  • పట్టణంలో దావానలంలా వ్యాపించిన నేతల గొడవ

వికారాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిమిత్తం హైదరాబాద్‌ తరలివెళ్లిన స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు గుడిమల్కాపూర్‌లో ప్రచారం అనంతరం గొడవకు దిగినట్లు పట్టణంలో చర్చించుకున్నారు. శనివారం రాత్రి ప్రచారం ముగిసిన తర్వాత నేతలు విందులో సరదాగా గడుపుతూ రెండు మండలాలకు చెందిన ప్రధాన నాయకులు నువ్వా నేనా అంటూ దూషించుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే కాలర్లు సైతం పట్టుకునే వరకు వెళ్లగా వికారాబాద్‌ పట్టణ ప్రధాన నాయకుడు వారిని సముదాయించే ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. ఈ గొడవలో మండల నాయకుడు.. వికారాబాద్‌ పట్టణ నాయకుడిపై తిరగబడి దూషించినట్లు వారితో ఉన్న కొందరు సమాచారం ఇచ్చుకున్నట్టు తెలిసింది. ఈ వార్త ఆ నోటా.. ఈ నోటా పట్టణం అంతా వ్యాపించి టీఆర్‌ఎస్‌లో లొల్లి చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2020-11-30T05:29:53+05:30 IST