Philippinesలో వెల్లువెత్తిన వరదలు...138 మంది మృతి

ABN , First Publish Date - 2022-04-15T12:55:30+05:30 IST

ఫిలిప్పీన్స్‌ను వణికించిన ఉష్ణమండల తుపాన్ విపత్తు వల్ల మృతుల సంఖ్య 138కి పెరిగిందని ఆ దేశ అధికారులు తెలిపారు....

Philippinesలో వెల్లువెత్తిన వరదలు...138 మంది మృతి

మనీలా: ఫిలిప్పీన్స్‌ను వణికించిన ఉష్ణమండల తుపాన్ విపత్తు వల్ల మృతుల సంఖ్య 138కి పెరిగిందని ఆ దేశ అధికారులు తెలిపారు.ఫిలిప్పీన్స్‌లోని మధ్య, దక్షిణ ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. వరదలతో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. మధ్య లేటె ప్రావిన్స్‌లో 132 మంది మరణించారు. పలు గ్రామాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 101 మృతదేహాలను వెలికితీసినట్లు బేబే సిటీ ప్రభుత్వం తెలిపింది. లేటె ప్రావిన్స్‌లోని అబుయోగ్ పట్టణంలో 31 మృతదేహాలు, సమర్ ప్రావిన్స్‌లో ఒకటి,సెబూ ప్రావిన్స్‌లో రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


మధ్య ఫిలిప్పీన్స్‌లోని కాపిజ్, అక్లాన్, యాంటిక్, ఇలోయిలో ప్రావిన్స్‌లలోని 159 ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. పసిఫిక్ టైఫూన్ బెల్ట్‌పై ఉన్న ఫిలిప్పీన్స్ ద్వీపసమూహం ప్రపంచంలోని అత్యంత విపత్తు-పీడిత దేశాల్లో ఒకటిగా ఉంది. ఫిలిప్పీన్స్  ప్రతి సంవత్సరం దాదాపు 20 టైఫూన్లు తుపానులతో దెబ్బతింటుంది.


Updated Date - 2022-04-15T12:55:30+05:30 IST