చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2020-10-01T08:40:01+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కాజేసిన రూ.450కోట్లను వెంటనే వెల్ఫేర్‌ బోర్డుకు జమ చేయాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. అక్టోబరు 1న

చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయండి

కాట్రేనికోన, సెప్టెంబరు 30: రాష్ట్ర ప్రభుత్వం కాజేసిన రూ.450కోట్లను వెంటనే వెల్ఫేర్‌ బోర్డుకు జమ చేయాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. అక్టోబరు 1న తలపెట్టిన చలో కలెక్టరేట్‌ పోస్టర్‌ను పల్లంకుర్రు సచవాలయం వద్ద ఆవిష్కరించారు.  రూ.5కోట్ల కార్మిక సంక్షేమ నిధులు వెంటనే విడుదల చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఇసుకను తక్కువ ఽధరకే సరఫరా చేయాలని కోరారు.


అక్టోబరు 1న భవన నిర్మాణ కార్మికులందరూ కాకినాడ కలెక్టరేట్‌కు చేరుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూనియన్‌ల కార్యదర్శులు అయితాబత్తుల శ్రీనివాసరావు, బడుగు భీమేశ్వరరావు, వాకపల్లి వెంకటేశ్వరరావు పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో గెడ్డం రాం బాబు, వాకపల్లి సురేష్‌, కొల్లు సతీష్‌, బూల సుబ్బారావు, వర్షాల మహేష్‌, రాజకొండ తదితరులు శ్రీను పాల్గొన్నారు.


Updated Date - 2020-10-01T08:40:01+05:30 IST