ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-07-24T05:58:24+05:30 IST

ముక్కోటి వృక్షార్చనను విజయ వంతం చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. శుక్రవారం జడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్‌ అధికారులతో మొక్కలు నాటడంపై సమీక్ష నిర్వహించారు.

ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న వసంత

జగిత్యాల టౌన్‌, జూలై 23 : ముక్కోటి వృక్షార్చనను విజయ వంతం చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. శుక్రవారం జడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్‌ అధికారులతో మొక్కలు నాటడంపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 24న పు రపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని జడ్పీ చైర్‌ పర్పన్‌ పిలపునిచ్చారు. అనంతరం వసంత మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముం దుచూపుతో పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం కార్యక్ర మాన్ని చేపట్టారని వివరించారు. జిల్లాలోని సమస్త మండల పరి షత్‌ అధికారులు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలన్నారు. ఈ సమీక్షలో జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో ఉన్నారు.

Updated Date - 2021-07-24T05:58:24+05:30 IST