కాగజ్‌నగర్‌లో త్రివర్ణ పతాకాల సందడి

ABN , First Publish Date - 2022-08-09T04:20:59+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో కాగజ్‌నగర్‌ పట్టణంలో జాతీయ జెండాల కొనుగోలు సందడి నెలకొంది. ప్రతిఇంటిపై జాతీయ జెండా ఎగరాలని పిలుపునివ్వడంతో వారంరోజుల నుంచి జాతీయజెండాలు అమ్మే దుకాణాలు సందడిగా మారాయి.

కాగజ్‌నగర్‌లో త్రివర్ణ పతాకాల సందడి
కాగజ్‌నగర్‌ పోస్ట్‌ఆఫీస్‌లో విక్రయిస్తున్న జాతీయ జెండాలు

-మార్కెట్‌లో జాతీయ జెండాల అమ్మకాలు షురూ

-పోస్ట్‌ ఆఫీస్‌లో విక్రయాలు 

కాగజ్‌నగర్‌, ఆగస్టు 8: స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో కాగజ్‌నగర్‌ పట్టణంలో జాతీయ జెండాల కొనుగోలు సందడి నెలకొంది. ప్రతిఇంటిపై జాతీయ జెండా ఎగరాలని పిలుపునివ్వడంతో వారంరోజుల నుంచి జాతీయజెండాలు అమ్మే దుకాణాలు సందడిగా మారాయి. పార్టీలనేతలు జెండాల తయారీకి పెద్దసంఖ్యలో ఆర్డర్లు ఇస్తుండటంతో డిమాండు ఒక్కసారిగా పెరిగిందని వ్యాపా రులు చెబుతున్నారు. ఈసారి వజ్రోత్సవాల సందర్భంగా వారంరోజుల ముందు నుంచి జెండాలు కొనేందుకు ప్రజలు దుకాణాల వద్దకు వస్తున్నారు. సైజునుబట్టిరూ.50 నుంచి జాతీయ జెండాలను విక్రయానికి ఉంచారు. 

పోస్ట్‌ ఆఫీస్‌లో రూ.25నుంచి..

పోస్ట్‌ఆఫీస్‌లో ఒక్కోజెండాను రూ.25 కు విక్రయిస్తున్నారు. 2వేలకుపైగానే స్టాక్‌ను తెప్పించారు. సోషల్‌ మీడియాలో ప్రచారానికి వీలుగా పోస్ట్‌ ఆఫీస్‌లో సెల్ఫీ పాయింటు ఏర్పాటు చేశారు. దీంతో దుకాణాలతోపాటు పోస్ట్‌ఆఫీస్‌ కూడారద్దీగా మారింది.

జాతీయ జెండాలు విక్రయిస్తున్నాం

-ఎస్‌డీ హజరోద్దీన్‌, సబ్‌ డివిజనల్‌ ఇన్‌స్పెక్టర్‌, కాగజ్‌నగర్‌ 

కాగజ్‌నగర్‌ పోస్ట్‌ ఆఫీస్‌ మెయిన్‌ బ్రాంచీలో జాతీయ జెండాలు విక్రయిస్తున్నాం. ఒక్కో జెండాను రూ.25కు విక్రయిస్తున్నాం. సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేశాం. సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకునేందుకు వీలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.

Updated Date - 2022-08-09T04:20:59+05:30 IST