యుగపురుషుడికి ఘననివాళి

ABN , First Publish Date - 2022-01-19T06:21:47+05:30 IST

ఎన్టీఆర్‌ యుగ పు రుషుడు అని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ కొనియాడారు. మంగళ వారం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మదనపల్లెలో టీడీపీ నాయకులు వేర్వేరుగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.

యుగపురుషుడికి ఘననివాళి
ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద నివాళి అర్పిస్తున్న దొమ్మలపాటి తదితరులు

మదనపల్లె టౌన్‌, జనవరి 18:  ఎన్టీఆర్‌  యుగ పు రుషుడు అని  నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ కొనియాడారు. మంగళ వారం ఎన్టీఆర్‌  వర్ధంతి సందర్భంగా మదనపల్లెలో టీడీపీ నాయకులు వేర్వేరుగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. దొమ్మలపాటి ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పిం చారు. సీటీఎంలో మండల అధ్యక్షుడు డి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో రెండు చోట్ల ఎన్టీఆర్‌ వర్ధంతి నిర్వహించా రు. టీడీపీ నాయకులు దొమ్మలపాటి యశశ్విరాజ్‌, సిద్దప్ప, శివయ్య, రాజారెడ్డి, వినోద్‌, పూల మురళి, ప్రభాకర్‌, నిస్సార్‌అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నేత జయరామనాయుడు ఆధ్వర్యంలో  మార్కెట్‌యార్డు వద్ద అన్నదానం నిర్వహించారు.  జంగాల వెంకటరమణ, చీకిలబైలు సర్పంచ్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి రాట కొండ హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి, దేవతానగర్‌లోని పార్టీ కార్యాల యంలో ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు.  ముఖ్య అతిథిగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు, పార్టీ మైనార్టీ నాయకుడు ఎస్‌ఏ మస్తాన్‌, దొరస్వామినాయుడు, ఆర్‌జే వెంకటేశ్‌, రాటకొండ విష్ణు, అరుణ్‌తేజ్‌, పాల్గొన్నారు.


కమ్మవీధి సర్కిల్లో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రాటకొండ మధుబాబు ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. గంగారపు బాబురెడ్డి, వి.వెంకటేశ్‌, మహేష్‌ పాల్గొన్నారు. బర్మావీధిలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు నాదెళ్ల అరుణ్‌తేజ్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ వర్ధంతి నిర్వహించారు.

Updated Date - 2022-01-19T06:21:47+05:30 IST