నృత్యనికేతన్ విద్యార్థులకు సత్కారం
ABN , First Publish Date - 2021-02-25T04:40:44+05:30 IST
చినముషిడివా శాంతినగర్కు చెందిన నిర్మలానృత్యనికేతన్ విద్యార్థులు నేపాల్ రాజధాని ఖాట్మాండులో కూచిపూడి నృత్యప్రదర్శన ఇచ్చారు.
పెందుర్తి, ఫిబ్రవరి 24: చినముషిడివా శాంతినగర్కు చెందిన నిర్మలానృత్యనికేతన్ విద్యార్థులు నేపాల్ రాజధాని ఖాట్మాండులో కూచిపూడి నృత్యప్రదర్శన ఇచ్చారు. అక్క డి పశుపతినాథ్ దేవస్థానం ఆహ్వానం మేరకు ఈనెల 22న శివాష్టకం, శివతాండవం అం శాలలో విద్యార్థులు చేసిన నృత్యప్రదర్శన అలరించింది. అనంతరం నిర్వాహుకులు విద్యార్థులను సత్కరించారు. నృత్యనికేతన్ ప్రిన్సిపాల్ బొల్లాప్రగడ విజయజ్యోతి, అధ్యక్షుడు మందహాస్, ఆధ్వర్యంలో శర్వాణివీక్షిత, వాణి, చందన, గాయత్రి, శ్రావణజ్యోతి నృత్యప్రదర్శనలు ఇచ్చారు.