మసాలాలతో ఎండీహెచ్ ధర్మపాల్‌కు నివాళి

ABN , First Publish Date - 2020-12-04T14:50:20+05:30 IST

మసాలా కింగ్‌గా పేరొందిన ఎండీహెచ్ గ్రూప్ యజమాని ధర్మపాల్ గులాటీ కన్నుమూశారు. 98 ఏళ్ల ధర్మపాల్ కొంతకాలంగా...

మసాలాలతో ఎండీహెచ్ ధర్మపాల్‌కు నివాళి

చెన్నై: మసాలా కింగ్‌గా పేరొందిన ఎండీహెచ్ గ్రూప్ యజమాని ధర్మపాల్ గులాటీ కన్నుమూశారు. 98 ఏళ్ల ధర్మపాల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ధర్మపాల్ కన్నుమూతతో ఆయన అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో ధర్మపాల్‌కు ఒకవ్యక్తి వినూత్ని రీతిలో శ్రద్ధాంజలి ఘటించారు.


గ్రాఫిక్ డిజైనర్ వరుణ్ టండన్... ఎండీహెచ్ మసాలాలతో ధర్మపాల్ గులాటీ చిత్రాన్ని గీశారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వరుణ్‌కు ఈ చిత్రాన్ని గీసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టింది. ఈ చిత్రం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ ఎండీహెచ్ యజమాని ధర్మపాల్ ఒక రోల్ మోడల్. తన చిన్నపాటి ఉత్పత్తులతో గొప్పస్థాయికి చేరుకున్నారు. వరుణ్ దీనికి ముందు హాకీ లెజెండ్ బల్వీర్ సింగ్ సీనియర్ చిత్రాన్ని హాకీ స్టిక్, బాల్‌తో, మహాత్మాగాంధీ చిత్రాన్ని ఉప్పుతో, జస్పాల్ భట్టీ చిత్రాన్ని స్మయిలీ స్టిక్కర్‌తో రూపొందించారు. వరుణ్ పలు చిత్ర ప్రదర్శనల్లోనూ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T14:50:20+05:30 IST