కరోనా సేవకులకు సన్మానం

ABN , First Publish Date - 2021-06-13T05:11:39+05:30 IST

కరోనా తో మృతిచెందినవారి అంత్యక్రియలను గౌరవంగా జరిపిన స్వచ్ఛం ద సేవాసంస్థల సేవకులను జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ సన్మానించారు.

కరోనా సేవకులకు  సన్మానం
సేవకులను సన్మానిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ

ప్రొద్దుటూరు అర్బన్‌, జూ న్‌ 12: కరోనా తో మృతిచెందినవారి  అంత్యక్రియలను గౌరవంగా జరిపిన స్వచ్ఛం ద సేవాసంస్థల సేవకులను జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ సన్మానించారు. శనివారం కడపలో ఫైడ్‌, బ్లేస్సిఫౌండషన్‌ సీహెచ్‌ఆర్‌డీ స్వచ్ఛంద సేవాసంస్థలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రొద్దుటూరు కు చెందిన ఆదరణ స్వచ్చంద సేవాసంస్ద వికశిత పౌండేషన్‌, ప్రాణదాత సేవాసమితి, స్టార్‌ పౌండేషన్‌ ప్రతినిధులు బైసాని సత్యం,శూలం లక్ష్మీదేవి,బచ్చల సునీల్‌,సిరాజుద్దీన్‌లను జేసీ సన్మానించి పీపీకిట్లు అందజేశారు.


Updated Date - 2021-06-13T05:11:39+05:30 IST