అమీర్బాబుకు సన్మానం
ABN , First Publish Date - 2021-06-21T05:12:20+05:30 IST
సేవాతత్పరుడు, కడప అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్ వీఎస్ అమీర్బాబు చేసిన సేవలకు గుర్తింపుగా ఆదివారం ఆయనను నగర టీడీపీ అధ్యక్షుడు శివకొండారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.
కడప, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): సేవాతత్పరుడు, కడప అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్ వీఎస్ అమీర్బాబు చేసిన సేవలకు గుర్తింపుగా ఆదివారం ఆయనను నగర టీడీపీ అధ్యక్షుడు శివకొండారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శివకొండారెడ్డి మాట్లాడుతూ నగర శివారులోని రిమ్స్ వద్ద కరోనా బాధితులకు గత 33 రోజులుగా అమీర్బాబు అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఆనందించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి కర్ఫ్యూ సడలింపునివ్వడంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.
వ్యాక్సిన్ అందించడంలో ప్రభుత్వం విఫలం
కొవిడ్ మహమ్మారితో అల్లాడిపోతున్న ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘెరంగా విఫలమైందని కడప అసెంబ్లీ టీడీపీ ఇన్చార్జ్ వీఎస్ అమీర్బాబు అన్నారు. ఆదివారం నగరంలోని టీడీపీ కార్యాలయంలో నిరసన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికైనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివకొండారెడ్డి, జలతోటి జయకుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు నక్కల శివరాం, జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు, వరప్రసాద్, శివకొండారెడ్డి, ఆజాద్, వర ప్రసాద్, రవిశంకర్రెడ్డి, బాలదాసు, చాన్బాషా, హాజీ పాల్గొన్నారు.