టీడీపీ నాయకుడి మృతికి..

ABN , First Publish Date - 2021-01-16T05:58:19+05:30 IST

చాగలమర్రి సింగిల్‌విండో మాజీ ఉపాధ్యక్షుడు, టీడీపీ నాయకుడు ఎంసీ మహబూబ్‌బాషా (42) గుండెపోటుతో గురువారం తెల్లవారుజామున మృతి చెందారు.

టీడీపీ నాయకుడి మృతికి..

 ప్రముఖుల సంతాపం


చాగలమర్రి, జనవరి 15: చాగలమర్రి సింగిల్‌విండో మాజీ ఉపాధ్యక్షుడు, టీడీపీ నాయకుడు ఎంసీ మహబూబ్‌బాషా (42) గుండెపోటుతో గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి చాగలమర్రికి చేరుకొని మహబూబ్‌బాషా మృతికి సంతాపం తెలియజేశారు. కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భూమా మాజీ సర్పంచ్‌ ఎంసీ అన్సర్‌బాషా సోదరుడు మహబూబ్‌బాషా సింగిల్‌విండో ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారన్నారు. బీజేపీ ఆళ్లగడ్డ ఇన్‌చార్జి భూమా కిషోర్‌రెడ్డి మహబూబ్‌బాషా మృతదేహంపై పూలమాల వేసి సంతాపం ప్రకటించారు. ఆళ్లగడ్డ వైసీపీ నాయకులు ఇరిగెల భరత్‌కుమార్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. టీడీపీ మండల కన్వీనర్‌ నరసింహారెడ్డి, నాయకులు కొలిమి ఉసేన్‌వలి, గుత్తి నరసింహులు, బీసీ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణగౌడ్‌, బీజేపీ నాయకులు అంబటి మహేశ్వర్‌రెడ్డి, బ్రహ్మానందరెడ్డి   పాల్గొన్నారు.


Updated Date - 2021-01-16T05:58:19+05:30 IST