ఏపీ డిస్కం సంస్థలు తెలిపిన కారణాల పట్ల ట్రిబ్యునల్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-09-26T01:20:48+05:30 IST

సోలార్‌ విద్యుత్‌ను తక్షణమే కొనుగోలు చేయాలని, ఏపీ డిస్కం, ట్రాన్స్‌కో సంస్థలకు విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను తీసుకోకపోవడం

ఏపీ డిస్కం సంస్థలు తెలిపిన కారణాల పట్ల ట్రిబ్యునల్‌ ఆగ్రహం

అమరావతి: సోలార్‌ విద్యుత్‌ను తక్షణమే కొనుగోలు చేయాలని, ఏపీ డిస్కం, ట్రాన్స్‌కో సంస్థలకు విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను తీసుకోకపోవడం అంటే జాతీయ వృధానేనని ట్రిబ్యునల్‌ వ్యాఖ్యానించింది. అనంతపురం సోలార్‌ ప్రైవేట్‌ సంస్థ నుంచి 50 మెగావాట్ల విద్యుత్‌ను తీసుకునేందుకు తక్షణమే ఏర్పాట్లు ఏర్పాట్లు చేయాలని, ఏపీ డిస్కం, ఏపీ ట్రాన్స్‌కో సంస్థలకు అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ డిస్కం సంస్థలు తెలిపిన కారణాల పట్ల ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 20కి ట్రిబ్యునల్‌ వాయిదా వేసింది.

Updated Date - 2020-09-26T01:20:48+05:30 IST