ఒక వైపు జ్వరపీడితులు.. మరోవైపు తరగతులు
ABN , First Publish Date - 2022-08-05T17:25:29+05:30 IST
ఒకవైపు జ్వరంతో బాధపడుతూ మంచం పట్టిన చిన్నారులు... మరోవైపు చదువుకుంటున్న విద్యార్థులు. ఈ దృశ్యం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం రావికోన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోనిది. ఇక్కడ 3 నుంచి పదో తరగతి వరకూ 154 మంది
పార్వతీపురం రూరల్: ఒకవైపు జ్వరంతో బాధపడుతూ మంచం పట్టిన చిన్నారులు... మరోవైపు చదువుకుంటున్న విద్యార్థులు(students). ఈ దృశ్యం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం రావికోన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల(Tribal Welfare Ashram School)లోనిది. ఇక్కడ 3 నుంచి పదో తరగతి వరకూ 154 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ వసతి సమస్య తీవ్రంగా ఉంది. అరకొరగానే గదులు ఉన్నాయి. ఏడు గదులకుగాను మూడింటిని నిర్వహణకు వినియోగిస్తున్నారు. మిగతా నాలుగు గదుల్లో విద్యార్థులకు వసతితో పాటు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొందరు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. అయితే వసతి సమస్య కారణంగా ఒక గదిలోనే జ్వరపీడితులు విశ్రాంతి తీసుకుంటుండగా.. మిగతా విద్యార్థులు చదువుకుంటూ కనిపించారు. దీనిపై హెచ్ఎం సోమన్నదొర వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా కొత్తగా భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయని చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.