గిరిజనుల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-02T05:07:04+05:30 IST

గిరిజనుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రకా్‌షరాథోడ్‌ డిమాండ్‌ చేశారు.

గిరిజనుల సమస్యలను పరిష్కరించాలి

 నారాయణఖేడ్‌, జూలై 1: గిరిజనుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రకా్‌షరాథోడ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖేడ్‌లోని సేవాలాల్‌ చౌక్‌ వద్ద సంఘం జెండాను ఎగుర వేసి కేక్‌లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండాలు, గిరిజనుల అభివృద్ధి కోసం తమ సంఘం పోరాటాలు కొనసాగిస్తుందన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌, పంచాయతీల్లో మౌళిక సదుపాయాల కోసం రూ.కోటిచొప్పున కేటాయిస్తూ ఎస్టీబంధు పథకాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్‌నాయక్‌, జిల్లా అధ్యక్షుడు సురే్‌షనాయక్‌, ఉపాధ్యక్షుడు రమావత్‌సురే్‌ష, నాయకులు రవినాయక్‌, సంతో్‌షనాయక్‌, అభిరాం, విష్ణునాయక్‌, శ్రీనివా్‌సనాయక్‌, ప్రకా్‌షనాయక్‌, సంతోష్‌, సురేష్‌, లక్ష్మణ్‌, రాజు, తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-07-02T05:07:04+05:30 IST