ఏటిలోన చేపలంట..

ABN , First Publish Date - 2021-07-22T05:09:23+05:30 IST

భారీ వర్షాలకు గోదావరి ఎర్రబడింది.. ఏటిలో చేప ఎగిరెగిరి పడుతోంది.

ఏటిలోన చేపలంట..

పోలవరం, జూలై 21: భారీ వర్షాలకు గోదావరి ఎర్రబడింది.. ఏటిలో చేప ఎగిరెగిరి పడుతోంది. ఉపనదులు, కొండ వాగులతో పాటు శబరి, ఇంద్రావతి, సీలేరు జలాలతో గోదావరికి ఎర్ర నీరు చేరింది. ఈ సీజన్‌లో చీర మీను (చిన్ని చేప పిల్లలు) ప్రత్యేకం. చీర నాలుగు కొసలు పట్టుకుని గోదావరిలో ముంచి పైకి తీస్తే చిన్న పిల్లల చిటికెన వేలి కంటె చిన్ని చేప పిల్లలు ఎగిరి పడుతుంటాయి. చీరతో పట్టుకునే చిన్ని చేప పిల్లలను చీర మీనం (చీర మీను)గా వ్యవహరిస్తారు. తల్లవరం, గాజులగొంది, పెద్దూరు గ్రామాల వారు  చిన్నాపెద్దా తేడా లేకుండా గోదావరిలో చీర మీను పడ తారు. ఏటా ఈ సీజన్‌లో చీర మీను రుచితో పాటు మంచి ఆరోగ్యమని చెబుతారు. పరీవాహక గిరిజన గ్రామాల్లో ప్రతీ ఒక్కరు చీర మీను పట్టుకుని తింటారు. మైదాన ప్రాంత పరీవాహక ప్రాంతాల్లో పట్టిన చీర మీను పట్టణాల్లో విక్రయిస్తారు.

Updated Date - 2021-07-22T05:09:23+05:30 IST