ఆ బాలికకు న్యాయం చేయండి: గిడ్డి ఈశ్వరి

ABN , First Publish Date - 2020-07-07T03:21:30+05:30 IST

ఏజెన్సీలోని జిన్నేరు గ్రామం కే కోడాపల్లిలో అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన

ఆ బాలికకు న్యాయం చేయండి: గిడ్డి ఈశ్వరి

విశాఖపట్నం: ఏజెన్సీలోని జిన్నేరు గ్రామం కే కోడాపల్లిలో అత్యాచారానికి గురైన బాలికకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. గిరిజన బాలికపై అత్యాచారం జరిగి పది రోజులైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-07T03:21:30+05:30 IST