గిరిజ‌నుల మృతిపై న్యాయ‌ విచార‌ణ జ‌రిపించాలి: లోకేష్‌

ABN , First Publish Date - 2022-02-05T02:52:21+05:30 IST

కల్తీ కల్లు ఘటనలో గిరిజ‌నుల మృతిపై న్యాయ‌ విచార‌ణ జ‌రిపించాలని

గిరిజ‌నుల మృతిపై న్యాయ‌ విచార‌ణ జ‌రిపించాలి: లోకేష్‌

అమరావతి: కల్తీ కల్లు ఘటనలో గిరిజ‌నుల మృతిపై న్యాయ‌ విచార‌ణ జ‌రిపించాలని ప్రభుత్వాన్ని టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ డిమాండ్ చేశారు. మీ సొంత కంపెనీ ప్రాణాంత‌క మ‌ద్యం అత్యధిక ధ‌ర‌కి కొని తాగ‌లేక లోదొడ్డి గిరిజ‌నులు క‌ల్తీ క‌ల్లు తాగి చ‌నిపోయారని ఆయన ఆరోపించారు. కేసును ఎందుకు ప‌క్కదారి ప‌ట్టిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. లోదొడ్డికి టీడీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ వెళ్తే అరెస్ట్ చేసిన పోలీసులు, వైసీపీ నేత‌ల్ని ఎలా పంపించారని ఆయన నిలదీశారు. స‌ర్కారు తప్పులేకపోతే కేసుని ఎందుకు ప‌క్కదారి ప‌ట్టిస్తున్నారన్నారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.25 ల‌క్షల ప‌రిహారం ఇవ్వాలన్నారు. టీడీపీ నిజ‌నిర్ధార‌ణ బృందాన్ని వెంటనే విడుద‌ల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-02-05T02:52:21+05:30 IST