ట్రెంచ్ పనులను అడ్డుకున్న భద్రాద్రి జడ్పీ చైర్మన్
ABN , First Publish Date - 2021-03-05T05:35:59+05:30 IST
ట్రెంచ్ పనులను అడ్డుకున్న భద్రాద్రి జడ్పీ చైర్మన్
సీఎం నిర్ణయం కోసం ఎదురుచూడాలని సూచన
ఆళ్లపల్లి, మార్చి 4: ఆళ్లపల్లి మండలం వెంకటా పురం పంచాయతీ పరిధిలోని పోడు భూముల్లో గురువారం అటవీశాఖ అధికారులు ట్రెంచ్ కొడు తుండగా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జడ్పీటీసీ సభ్యుడు హనుమంతరావు, ఎంపీపీ మంజుభార్గవి ఆ పనులను అడ్డుకు న్నారు. ఈ సందర్భంగా జడ్పీచైర్మన్ మాట్లా డు తూ సీఎం కేసీఆర్ పోడుభూములకు పట్టా లు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని, అటవీశాఖ అధికారులు కాస్త వేచి చూడాలని, తక్షణం ట్రెంచ్ పనులను నిలిపివేయాలని సూచించారు. ఆయన వెంట పోడురైతులు, టీఆర్ఎస్ నాయకులున్నారు.