కరోనా బాధితులకు వైద్యమందించండి
ABN , First Publish Date - 2020-08-06T06:36:28+05:30 IST
కరోనా బాధితులకు వైద్యమందించేందుకు జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ముందుకు రావాలని డిప్యూటీ సీఎం ఎస్బీ
ప్రైవేటు ఆసుపత్రులకు డిప్యూటీ సీఎం పిలుపు
కడప (ఎర్రముక్కపల్లె), ఆగస్టు 5: కరోనా బాధితులకు వైద్యమందించేందుకు జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ముందుకు రావాలని డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా పిలుపునిచ్చారు. కడప స్టేట్గెస్ట్హౌ్సలో బుధవారం ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్యశ్రీ అనుమతి ఉన్న అన్ని ప్రైవేటు ఆసుపత్రులు తప్పకుండా కరోనా పేషంట్లకు వైద్యం అందించాలన్నారు.
ఇందుకు జిల్లా యాంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని, కలెక్టరుతో సంప్రదించి డాక్టర్లు కోరిన విధంగా పారామెడికల్ స్టాఫ్ను ప్రొవైడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మన జిల్లా నుంచి కరోనా పేషంట్లు చాలా మంది హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారని, ఇక నుంచి కరోనా పేషంట్లు బయటి ప్రాంతాలకు వెళ్లకుండా కడపలోనే వైద్యం అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులు ముందుకు రావాలని కోరారు. కరోనా వైద్యం అందించే ప్రైవేటు ఆసుపత్రుల్లోని పారామెడికల్ స్టాఫ్కు ఉద్యోగావకాశాల్లో ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మలోలా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సునీల్కుమార్, తహసీల్దారు శివరామిరెడ్డి, వివిధ ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు పాల్గొన్నారు.