ప్రయాణం..ప్రమాదం

ABN , First Publish Date - 2020-06-04T09:13:12+05:30 IST

మేడ్చల్‌ పట్టణంలో ఆటో ప్రయాణం ప్రమాదకరంగా మారింది.

ప్రయాణం..ప్రమాదం

లాక్‌డౌన్‌ నిబంధనను ఉల్లంఘిస్తున్న ఆటోడ్రైవర్లు  ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులు

రెట్టింపు చార్జీల వసూలు  కనిపించని మాస్కులు  పట్టించుకోని అధికారులు


మేడ్చల్‌ రూరల్‌ : మేడ్చల్‌ పట్టణంలో ఆటో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. లాక్‌డౌన్‌ నిబంధనలకు లోబడి ఆటోలు నడుపుకోవాలని ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చాలామంది ఆటోడ్రైవర్లు అందుకు విరుద్ధంగా నడుపుతున్నారు. ప్రస్తుతం పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు సర్వీసులు లేనందున ప్రతిఒక్కరూ ఆటోలపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుని స్థానిక ఆటో యజమానులు రెట్టింపు చార్జీలను వసూలు చేస్తున్నారు. అదేవి ధంగా కేవలం ఇద్దరు ముగ్గురిని మాత్రమే ఆటోలో ఎక్కించాలన్న నిబంధనను తుంగలో తొక్కుతున్నారు.


ఏకంగా 10 మందికి తగ్గకుండా ప్రయాణికులను తరలిస్తున్నారు. స్థానిక ఆటోల్లో ప్రయాణికులను తరలించే తీరు కరోనా కట్టడి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఆటోల్లో ఎక్కేవారిలో సగంమంది మాస్కులు ధరించడం లేదు. ప్రధానంగా గ్రామీణప్రాంతాల వైపు వెళ్లే ఆటోలు పూర్తిగా లాక్‌డౌన్‌ నిబంధనలకు అతిక్రమిస్తున్నాయని ఆరోపణలు వినపడుతున్నాయి. 

Updated Date - 2020-06-04T09:13:12+05:30 IST