ట్రావెల్ బస్సులో తరలిస్తున్న 715కిలోల గంజాయి స్వాధీనం
ABN , First Publish Date - 2021-12-05T05:19:49+05:30 IST
ట్రావెల్ బస్సు లగేజీ బాక్సులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
రావులపాలెం
రూరల్, డిసెంబరు 4: ట్రావెల్ బస్సు లగేజీ బాక్సులో తరలిస్తున్న
గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి
తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్పీ రవీంద్రనాథ్బాబు ఆదేశాల మేరకు రావులపాలెం
సీఐ వి.కృష్ణ, ఎస్ఐ పి.బుజ్జిబాబు ఈనెల 3వతేదీ సాయంత్రం మండల పరిధిలోని
రావులపాడు శివారు మల్లాయిదొడ్డివద్ద జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ
చేస్తున్నారు. ఆ సమయంలో రాజమహేంద్రవరం వైపు నుంచి చెన్నై వెళ్తున్న
ప్రైవేటు ట్రావెల్ బస్సును ఆపి తనిఖీ చేయగా అందులో 17 సంచులలో మూటలు
కట్టిఉన్న గంజాయిని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని
తిరుణ్ణాళవెల్లి జిల్లాకు చెందిన మురుగన్ వీరమణికందన్, తమిళనాడులోని
కోయంబేడ్కు చెందిన రంగసామి సెల్వంను అరెస్టు చేసి వారు తరలిస్తున్న రూ.72
లక్షలు విలువైన 715 కిలోల గంజాయిని, ట్రావెల్బస్సు, రెండు సెల్ఫోన్లు
స్వాధీనం చేసుకున్నామన్నారు.