కారులో ఢిల్లీకి గంజాయి రవాణా
ABN , First Publish Date - 2022-05-22T07:00:06+05:30 IST
కారులో ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) అధికారులు పెందుర్తి శివారు సరిపల్లి ప్రాంతంలో శనివారం పట్టుకున్నారు. వీరి నుంచి 53 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురి అరెస్టు
వేపగుంట, మే 21: కారులో ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) అధికారులు పెందుర్తి శివారు సరిపల్లి ప్రాంతంలో శనివారం పట్టుకున్నారు. వీరి నుంచి 53 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సెబ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ బి.రశ్రీనాథుడు పర్యవేక్షణలో సీఐ సరోజని తన సిబ్బందితో సరిపల్లిలో కాపుకాసి కారును ఆపి తనిఖీలు చేశారు. కారు సీట్లో వెనుక, కారు ముందు బోనెట్లో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. ఢిల్లీకి చెందిన రితిక్ కుమార్, జ్యోతి. పటియాలాకు చెందిన అభయ్కుమార్, ఘజియాబాద్కు చెందిన విపిన్ ముఠాగా ఏర్పడి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. వారు కారులో అరకు నుంచి ఢిల్లీకి గంజాయి అక్రమంగా రవాణా చేసేవారు. ఇదే క్రమంలో డ్రైవర్ విపిన్, అభయ్కుమార్, జ్యోతిలు కారులో వస్తుండగా, పోలీసుల తనిఖీలు నిర్వహించి అరెస్టు చేశారు. ఈ తనిఖీల్లో సిబ్బంది శ్రీనివాస్, హరి ఆశోక్, నాయుడు, శివ తదితరులు పాల్గొన్నారు.