సచివాలయాల్లో పారదర్శక సేవలు
ABN , First Publish Date - 2021-07-25T05:59:40+05:30 IST
గ్రామ సచివాలయ ఉద్యోగులు తమ పనితీరును మెరుగుపర్చుకుని తద్వారా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని డీఎల్పీవో శిరీషారాణి సూచిం చారు.
డీఎల్పీవో శిరీషారాణి సూచన
నర్సీపట్నం అర్బన్, జూలై 24 : గ్రామ సచివాలయ ఉద్యోగులు తమ పనితీరును మెరుగుపర్చుకుని తద్వారా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని డీఎల్పీవో శిరీషారాణి సూచిం చారు. చెట్టుపల్లి గ్రామ సచివాలయాన్ని శనివారం ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. వివిధ అభివృద్ధి పనుల ప్రగతిపై ఆరా తీశారు. కాంట్రాక్టర్లు, పంచాయతీ సర్పంచ్లతో మాట్లాడారు. త్వరతగతిన పనులు పూర్తిచేయాలన్నారు