పారదర్శకంగా ప్రభుత్వ పథకాల అమలు
ABN , First Publish Date - 2020-09-24T08:10:13+05:30 IST
ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని డీఆర్డీఏ పీడీ వై.హరిహరనాథ్ సూచించారు. కొత్తపల్లి స్త్రీశక్తి కార్యాలయాన్ని
డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్
కొత్తపల్లి, సెప్టెంబరు 23: ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని డీఆర్డీఏ పీడీ వై.హరిహరనాథ్ సూచించారు. కొత్తపల్లి స్త్రీశక్తి కార్యాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మండల సమాఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ బీమా, బ్యాంక్ లింకేజీ, ఆసరా, చేయూత పథకాల అమలులో ఎటువంటి అవకతవకలకు పాల్పడరాదని వీవోలకు సూచిం చారు. ఏపీఎం విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.