‘దళితబంధు’ పంపిణీలో పారదర్శకత

ABN , First Publish Date - 2022-05-21T06:12:36+05:30 IST

దళితబంధు యూనిట్ల పంపిణీలో అధికారు లు పారదర్శకత పాటించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు.

‘దళితబంధు’ పంపిణీలో పారదర్శకత
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పథి

కలెక్టర్‌ పమేలాసత్పథి

భువనగిరి రూరల్‌, మే20: దళితబంధు యూనిట్ల పంపిణీలో అధికారు లు పారదర్శకత పాటించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళిత బంధు పథకం కిం ద లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను 15 రోజుల్లోగా గ్రౌండింగ్‌ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ, సీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్యాంసుందర్‌, సీపీవో బి.మాన్యానాయక్‌, ఈఎస్‌ నవీన్‌కుమార్‌, డీసీవో పరిమళదేవి, డీఈవో కె.నర్సింహ, హార్టికల్చర్‌ జిల్లా అధికారి అన్నపూర్ణ, జిల్లా పశు సంవర్థక, మత్స్యశాఖల అభివృద్ధి అధికారులు డాక్టర్‌ వి.కృష్ణ, రాజారాం, అడిషినల్‌ డీఆర్‌డీవో టి.నాగిరెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-21T06:12:36+05:30 IST