ఉపాధ్యాయులకు బదిలీలు సహజం

ABN , First Publish Date - 2022-01-17T03:58:34+05:30 IST

ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని ఎమ్మెల్యే ఆత్రంసక్కు అన్నారు. బదిలీపైవెళ్తున్న సావర్‌ఖేడ ఉపాధ్యాయుడు రంగ య్యకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఉపాధ్యాయులకు బదిలీలు సహజం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు

కెరమెరి, జనవరి 16: ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని ఎమ్మెల్యే ఆత్రంసక్కు అన్నారు. బదిలీపైవెళ్తున్న సావర్‌ఖేడ ఉపాధ్యాయుడు రంగ య్యకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. నియోజక వర్గంలోని సావర్‌ఖేడ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తేడానికి ఉపాధ్యాయుడు రంగయ్యచేసిన సేవలే కారణ మన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతిరాం, వైస్‌ఎంపీపీ అబ్దుల్‌ కలాం, నాయకులు మునీర్‌ అహ్మద్‌, ఎంఈవో సుధాకర్‌, ఎస్సై రమేష్‌, సర్పంచ్‌లు తులసీరాం, నానేశ్వర్‌, జగన్నాథ్‌, ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T03:58:34+05:30 IST