ఏపీ జెన్కోలో విద్యుత్ ఇంజినీర్లపై బదిలీ కొరడా
ABN , First Publish Date - 2020-07-05T02:09:04+05:30 IST
ఏపీ జెన్కోలో విద్యుత్ ఇంజినీర్లపై బదిలీ కొరడా
కృష్ణా: ఇబ్రహీంపట్నం ఏపీ జెన్కోలో విద్యుత్ ఇంజనీర్లపై బదిలీ కొరడా ఝులిపించారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో 54 మంది ఇంజినీర్లను బదిలీ చేశారు. రెండు రోజుల క్రితం జెన్కో ఎండీ, చీఫ్ జీఎం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ విద్యుత్ కేంద్రాల నుంచి ఎన్టీటీపీఎస్కు 34 మంది ఇంజినీర్లను బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.