ఏపీలో ముగ్గురు ఐఏఎస్ల బదిలీ
ABN , First Publish Date - 2022-01-22T21:32:19+05:30 IST
ఏపీలో ముగ్గురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం
అమరావతి: ఏపీలో ముగ్గురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హిమాన్షు కౌశిక్ను ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్గా నియమించింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నిశాంత్ కుమార్ను బదిలీ చేసింది. కేతన్ గార్గ్ను అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు.