ఎన్నికల దృష్ట్యా తహసీల్దార్ల బదిలీ

ABN , First Publish Date - 2020-09-30T08:25:49+05:30 IST

దుబ్బాక ఉపఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల కాగా ఆ దిశగా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఎన్నికల

ఎన్నికల దృష్ట్యా తహసీల్దార్ల బదిలీ

ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట, సెప్టెంబరు 29: దుబ్బాక ఉపఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదల కాగా ఆ దిశగా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు తహసీల్దార్లను బదిలీ చేయనున్నారు. ఈ క్రమంలో ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న 8 మంది తహసీల్దార్లను సిద్దిపేట, మెదక్‌ జిల్లాలకు బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడికి బదిలీ అయిన వారిలో ఎన్‌.రాజేందర్‌రెడ్డి, ఎం.హేమామాలిని, ఎం.శ్రీనివాసరావు, పీ.శ్రీనివాసరావు, పీ.శ్రీనివాసరెడ్డి, వై.వెంకటేశ్‌, బీవీ శైలేంద్ర కుమార్‌, ఎం.ప్రేమ్‌కుమార్‌ ఉన్నారు. వీరిని దుబ్బాక నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నియమించే అవకాశాలు ఉన్నాయి. 

Updated Date - 2020-09-30T08:25:49+05:30 IST