కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి బదిలీ

ABN , First Publish Date - 2022-08-09T05:40:02+05:30 IST

నల్లగొం డ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక సమరం నేపథ్యంలో కీలక అధికారుల బదిలీలు సోమవారం రాత్రి చకచక జరిగిపోయా యి. ఓ వైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నిమిషాల్లోనే స్పీకర్‌ పోచారం శ్రీనివా ్‌సరెడ్డి ఆమోదించడం, అదే రోజు రాత్రి కీలక అధికారులను బదిలీ చేయడం విశేషం.

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి బదిలీ

ఇన్‌చార్జిగా పాటిల్‌ హేమంత్‌కేశవ్‌

నల్లగొండ, ఆగస్టు 8 (ఆంద్రజ్యోతి ప్రతినిధి): నల్లగొం డ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక సమరం నేపథ్యంలో కీలక అధికారుల బదిలీలు సోమవారం రాత్రి చకచక జరిగిపోయా యి. ఓ వైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నిమిషాల్లోనే స్పీకర్‌ పోచారం శ్రీనివా  ్‌సరెడ్డి ఆమోదించడం, అదే రోజు రాత్రి కీలక అధికారులను బదిలీ చేయడం విశేషం. కలెక్టర్‌గా ఉన్న వినయ్‌కృష్ణారెడ్డిని నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ను ఇన్‌చార్జి కలెక్టర్‌గా నియమించారు. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లా పూర్తి అదనపు బాధ్యతలో కలెక్టర్‌గా ఉన్న రాహుల్‌ శర్మను తిరిగి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా నియమించా రు. అదే విధంగా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో జనగామ అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావును నియమించారు. నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డిని సైతం బదిలీ చేసి ఆయన స్థానంలో ఏఎమ్మార్పీ జాయింట్‌ కలెక్టర్‌ జగన్నాథరావును నియమిస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2022-08-09T05:40:02+05:30 IST