ట్రాన్స్కో ఉద్యోగుల మహాధర్నా
ABN , First Publish Date - 2022-08-09T04:24:02+05:30 IST
విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వైరా, సత్తుపల్లి, మధిరలో ట్రాన్స్కో ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు.
వైరా/ సత్తుపల్లి/ మధిర, ఆగస్టు 8: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వైరా, సత్తుపల్లి, మధిరలో ట్రాన్స్కో ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఆయా డివిజన్ కార్యాలయ ఉద్యోగులు, ఆయా మండలాల ఉద్యోగులు మహాధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు నిలిపివేయాలని ఈసం దర్భంగా వారు డిమాండ్ చేశారు. సత్తుపల్లిలో నిర్వహిం చిన కార్యక్రమంలో ఏఈలు వెంకటేశ్వరరావు, సుజాత, నాగేశ్వరరావు, వైరా, మధిరలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.