‘ఎత్తిపోతల డివిజన్లు’ హైదరాబాద్కు తరలింపు
ABN , First Publish Date - 2020-11-29T06:24:52+05:30 IST
మహబూబ్నగర్ కేంద్రంగా విధులు నిర్వర్తించే ఎత్తిపోతల పథకాల విభాగాలను ఆ జిల్లా నుంచి తరలిస్తూ ట్రాన్స్కో నిర్ణయం తీసుకుంది.
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ కేంద్రంగా విధులు నిర్వర్తించే ఎత్తిపోతల పథకాల విభాగాలను ఆ జిల్లా నుంచి తరలిస్తూ ట్రాన్స్కో నిర్ణయం తీసుకుంది. మహబూబ్నగర్లో ఉన్న డివిజన్లన్నింటినీ హైదరాబాద్కు తరలించి, ఇకపై హైదరాబాద్ రూరల్ పేరుతో ఈ విభాగాలు కార్యకలాపాలు నిర్వర్తిస్తాయని ట్రాన్స్కో తెలిపింది. దాంతో పాటు ఆయా పోస్టులనూ శాశ్వతంగా రీ డిజిగ్నేట్ చేసింది.