కొండాపురంలో రైళ్లను ఆపాలి
ABN , First Publish Date - 2021-02-25T04:29:06+05:30 IST
ప్రస్తుతం కోవిడ్ వల్ల రైళ్లను కొండాపురంలో ఆపకపోవడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు.
కొండాపురం, ఫిబ్రవరి 24: ప్రస్తుతం కోవిడ్ వల్ల రైళ్లను కొండాపురంలో ఆపకపోవడం వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. కొండాపురం మీద నడిచే రైళ్లను కొండాపురం రైల్వేస్టేషన్లో ఆపడం లేదు. ఇటువైపు తిరుగుతున్న ఒకటి రెండు రైళ్లను కూడా కేవలం ఎర్రగుంట్ల, తాడిపత్రి, కడప తదితర రైల్వేస్టేషన్లలో మాత్రమే ఆపుతున్నారు. దీని వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిమిత సంఖ్యలోనైనా అనుమతులు ఇచ్చి కొండాపురం రైల్వేస్టేషన్ మీదుగా నడిచే రైళ్లను ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు. మార్చి నుంచి కొత్తగా కొన్నిరైళ్లు నడిచే అవకాశం ఉంది. దీంతో అన్ని రైళ్లను కొండాపురం రైల్వేస్టేషన్లో ఆపాలని చుట్టుపక్కల గ్రామాల ప్రయాణికులు కోరుతున్నారు.