28 రైళ్లు తాత్కాలికంగా రద్దు
ABN , First Publish Date - 2021-05-07T06:35:55+05:30 IST
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 28 రైళ్లను ఈనెల 31వ తేదీ వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్.
పాయకాపురం, మే 6 : దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 28 రైళ్లను ఈనెల 31వ తేదీ వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్. రాకేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు లేని కారణంగా కింద తెలిపిన రైళ్లును రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తిరుపతి-విశాఖపట్నం (02708), విశాఖపట్నం-తిరుపతి (02707), సికింద్రాబాద్-కర్నూల్ సిటీ (07023), కర్నూల్ సిటీ- సికింద్రాబాద్ (07024), కాకినాడ టౌన్- లింగంపల్లి (02775), లింగంపల్లి-కాకినాడ టౌన్ (02776), కాకినాడ టౌన్- రేణిగుంట (07249), రేణిగుంట-కాకినాడ టౌన్ (07250), విజయవాడ-లింగంపల్లి (02795), లింగంపల్లి-విజయవాడ (02796), కరీంనగర్-తిరుపతి (02762), తిరుపతి-కరీంనగర్ (02761), విజయవాడ-గూడూరు (02744), గూడూరు-విజయవాడ (02743), హెచ్ఎస్. నాంధేడ్-జమ్ముతావి (02751), జమ్ముతావి-హెచ్ఎస్. నాంధేడ్ (02752), సికింద్రాబాద్-విశాఖపట్నం (02784), విశాఖపట్నం-సికింద్రాబాద్ (02783), బిట్రగుంట-చెన్నై సెంట్రల్ (07237), చెన్నై సెంట్రల్-బిట్రగుంట (07238), సికింద్రాబాద్-సిరిపూర్కాకజ్నగర్ (07233), సిరిపూర్కాకజ్నగర్-సికింద్రాబాద్ (07234), నర్సాపూర్-నాగర్సోల్ (07231), నాగర్సోల్-నర్సాపూర్ (07232), సికింద్రాబాద్-విజయవాడ (02800), విజయవాడ-సికింద్రాబాద్ (02799), హైద్రాబాద్-సిరిపూర్కాకజ్నగర్ (07011), సిరిపూర్ కాకజ్నగర్-సికింద్రాబాద్ (07012).