రైళ్లలో రాయితీలు కట్
ABN , First Publish Date - 2021-04-17T05:21:09+05:30 IST
రైళ్లలో రాయితీలు కట్
రెగ్యులర్ రైళ్లు లేకపోవటంతో ఆరు నెలలుగా ఇదే తంతు
విజయవాడ, ఆంధ్రజ్యోతి : కొవిడ్ పేరుతో రెగ్యులర్ రైళ్లకు రైల్వేశాఖ మంగళం పాడటంతో వేలాదిమంది ప్రయాణికులు రాయితీలను కోల్పోతున్నారు. రెగ్యులర్ రైళ్లలో ప్రయాణికులకు అనేక రాయితీలు వర్తిస్తుంటాయి. దివ్యాంగులు, అనారోగ్యానికి గురైనవారు, సీనియర్ సిటిజన్లు, అవార్డు విజేతలు, వితంతువులు, విద్యార్థులు, యువత, రైతులు, కళాకారులు, క్రీడాకారులు, వైద్య నిపుణులు ఇలా అనేక రంగాల వారికి రాయితీ ప్రయోజనాలుంటాయి. ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్ రైళ్లలో ఏ ఒక్క రాయితీ వర్తించట్లేదు. రెగ్యులర్ రైళ్లు లేకపోవటం వల్ల పై రాయితీలన్నీ కోల్పోవటమే కాకుండా సామాన్య ప్రయాణికులు జనరల్ బోగీల్లో ప్రయాణించే అవకాశం లేదు. రెగ్యులర్ రైళ్లు లేకపోవటం వల్ల జనరల్ బోగీల సదుపాయం కట్ అయింది. అన్నీ ఎక్స్ప్రెస్లే నడుస్తున్నాయి. పేదవారికి అందుబాటులో ఉండే పాసింజర్ రైళ్లు నడవట్లేదు. చాలా పాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్లుగా అప్గ్రేడ్ కూడా చేసేశారు.