రైతు భరోసా కేంద్రాలపై సిబ్బందికి శిక్షణ

ABN , First Publish Date - 2020-05-12T10:59:22+05:30 IST

రైతు భరోసా కేంద్రాలపై సోమవారం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

రైతు భరోసా కేంద్రాలపై సిబ్బందికి శిక్షణ

రైల్వేకోడూరు, మే, 11: రైతు భరోసా కేంద్రాలపై సోమవారం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆత్మ అడిషినల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ప్రభాకర్‌, రైతు శిక్షణ కేంద్రం అధికారి పద్మజ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రంలో డిజిటల్‌ కియోస్క్‌ ద్వారా రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకొని వారికి కావాలసిన నాణ్యమైన ఎరువలు, విత్తనాలు, పురుగు మందులు వారి వారి గ్రామాల్లోనే పొందవచ్చనని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఏడీఏ ఉమ, ఏవో జి. సుధాకర్‌, హబ్‌ ఇన్‌ఛార్జ్‌ ప్రవీన్‌, వీఏఏ, వీహెఏ లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-12T10:59:22+05:30 IST