పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నేడు శిక్షణ తరగతులు

ABN , First Publish Date - 2021-01-27T06:59:59+05:30 IST

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై బుధవారం నుంచి శిక్షణ తరగతులను నిర్వహిస్తారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నేడు శిక్షణ తరగతులు

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 26: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు చిత్తూరు డివిజన్‌ పరిధిలోని స్టేజ్‌-1 అధికారులకు జడ్పీ మీటింగ్‌ హాలులో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు డీపీవో దశరథరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ మార్కండేయులు, జేసీ వీరబ్రహ్మం, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీవో రేణుకతోపాటు 20 మండలాల ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు పాల్గొననున్నారు. కాగా.. ఎన్నికల నిర్వహణ, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విజయవాడ నుంచి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌కు ఇన్‌చార్జి కలెక్టర్‌ మార్కండేయులు, ఎస్పీ సెంథిల్‌కుమార్‌, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి తదితరులు హాజరవుతారని డీపీవో పేర్కొన్నారు.

Updated Date - 2021-01-27T06:59:59+05:30 IST