ఎత్తయిన వంతెనపై, జలపాతాల నడుమ ట్రైన్ వెళుతుంటే అద్భుతహ అనాల్సిందే!

ABN , First Publish Date - 2021-07-29T13:40:28+05:30 IST

ప్రకృతి సోయగాల నడుమ ఆహ్లాదకరంగా సాగే రైలు ప్రయాణానికి...

ఎత్తయిన వంతెనపై, జలపాతాల నడుమ ట్రైన్ వెళుతుంటే అద్భుతహ అనాల్సిందే!

పనాజీ: ప్రకృతి సోయగాల నడుమ ఆహ్లాదకరంగా సాగే రైలు ప్రయాణానికి సంబంధించిన దృశ్యం గోవాలో దర్శనమిచ్చింది. దూధ్ సాగర్ జలపాతాల మధ్య నుంచి వెళుతున్న ఒక రైలుకు సంబంధించిన వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను రైల్వేశాఖ విడుదల చేసింది. 


భారీ వర్షాల కారణంగా దూధ్ సాగర్ జలపాతాలు నిండైన నీటి ప్రవాహంతో ఎంతో అద్భుతంగా జాలువారుతున్నాయి. గోవా-బెంగళూరులను అనుసంధానం చేసే ఈ రైలు మార్గంలో ఈ ప్రకృతి సహజ సుందర దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. కాగా ప్రస్తుతం కొంకణ్, గోవాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 31 వరకూ ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. 


Updated Date - 2021-07-29T13:40:28+05:30 IST