రైలు ఢీకొని రిటైర్డ్ టీటీఈ మృతి
ABN , First Publish Date - 2020-02-20T08:30:02+05:30 IST
రైలు ఢీకొని రిటైర్డ్ టీటీఈ మృతి
లంకెలపాలెం, ఫిబ్రవరి 19 : లంకెలపాలెం సమీపంలో బుధవారం ఉదయం రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో రిటైర్డ్ టీటీఈ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. లంకెలపాలెం గ్రామానికి చెందిన గనిరెడ్డి జువ్వాలు (61) రైల్వే శాఖలో టీటీఈగా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. బుధవారం ఇంటి నుంచి లంకెలపాలెం జంక్షన్కు వెళ్లేందుకు స్థానికంగా గల రైల్వే ట్రాక్ దాటుతుండగా విజయవాడ నుంచి విశాఖపట్నం వస్తున్న గుర్తు తెలియని రైలు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో జువ్వాలు తల, శరీర భాగాలు వేర్వేరు అయ్యాయి. జీఆర్పీ ఎస్ఐ భుజంగరావు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యానికి తీసుకెళ్లి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. దువ్వాడ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.