TS News: మెదక్‌ జిల్లాలో విషాదం

ABN , First Publish Date - 2022-07-29T15:51:45+05:30 IST

జిల్లాలోని రామాయంపేటలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ విఫలమైందంటూ మూడు రోజుల క్రితం శివకుమార్ అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

TS News: మెదక్‌ జిల్లాలో విషాదం

మెదక్: జిల్లాలోని రామాయంపేటలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ విఫలమైందంటూ మూడు రోజుల క్రితం శివకుమార్ అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన తల్లి వరలక్ష్మి ఈరోజు చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని చెరువులో నుంచి వరలక్ష్మి మృతదేహాన్ని వెలికితీసి... పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-07-29T15:51:45+05:30 IST