బిడ్డను చంపి దంపతుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-05-21T09:12:48+05:30 IST

కుటుంబ కలహాలతో ఏడాది చి న్నారి చైత్రికను చంపి ఉరివేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన మహబూబాబాద్‌ జిల్లా

బిడ్డను చంపి దంపతుల ఆత్మహత్య

మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం  

కుటుంబ కలహాలే కారణమని అనుమానాలు


డోర్నకల్‌, మే 20: కుటుంబ కలహాలతో ఏడాది చి న్నారి చైత్రికను చంపి ఉరివేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం మన్నెగూడెం గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగింది. మన్నెగూడెంకు చెందిన అక్కిబాబు (28)కి చిలుక్కోయలపాడుకు చెందిన కృష్ణవేణి(25) తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొద్దిరోజుల కిందట కిృష్ణవేణి తన చిన్నపాపతో తల్లిగారింటికి వెళ్లింది. పెద్ద కూతురు వైష్ణవి (3) చిన్నమ్మ వద్ద ఉంది. కాగా బుధవారం మధ్యాహ్నం అక్కిబాబు చిలుక్కోయలపాడుకు వెళ్లి భార్యను, చిన్న బిడ్డను తీసుకొని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.


అయితే మన్నెగూడెం శివారుల్లోకి వస్తుండగా... అక్కిబాబు తన అత్తామామలకు ఫోన్‌ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని చె ప్పాడు. నివ్వెరపోయిన అత్తింటివారు వెంటనే అక్కడికి చేరుకోగా.. అప్పటికే అక్కిబాబు, కృష్ణవేని చెట్టుకు వేలాడుతూ విగతజీవులుగా కనిపించారు. పాప కోసం వె తకగా సమీపంలోని నీటిగుంటలో మృతదేహంగా లభ్యమైంది. అక్కిబాబు దంపతుల తీవ్రచర్యకు కుటుంబకలహాలే కారణమని చెబుతున్నారు. అయితే వాటి పూర్తి వివరాలు తెలియరాలేదు. డోర్నకల్‌ సీఐ శ్యాంసుందర్‌, ఎస్సై భద్రునాయక్‌ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దంపతులు, చిన్నారి మృతదేహాలను చూసి బంధువులు, మన్నెగూడెంవాసులు కన్నీరుమున్నీరయ్యారు. 

Updated Date - 2020-05-21T09:12:48+05:30 IST