గుంటూరు జిల్లాలో విషాదం
ABN , First Publish Date - 2021-12-11T02:01:02+05:30 IST
జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడులో
గుంటూరు: జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం నెలకొంది. కృష్ణానదిలో స్నానానికి దిగిన ఏడుగురు గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో ఆరుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆరుగురి మృతి చెందారు. శ్వేత శృంగాచలం వేద పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు మృతి చెందారు. మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. మృతి చెందిన వారిని ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.