నేటి నుంచి వీఎస్టీ రోడ్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN , First Publish Date - 2022-03-01T12:47:49+05:30 IST

నేటి నుంచి వీఎస్టీ రోడ్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

నేటి నుంచి వీఎస్టీ రోడ్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్ సిటీ/రాంనగర్‌ : ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ నుంచి విద్యానగర్‌ హిందీ మహావిద్యాలయం వైపు వెళ్లే వీఎస్టీ రోడ్డు మార్గంలో మంగళవారం నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఒకవైపు రోడ్డును మూసి, మరోవైపు రోడ్డులో టూ వేను అమలు చేయనున్నారు. వరదనీటి సమస్య పరిష్కారం కోసం రూ.12 కోట్ల వ్యయంతో నాగమయ్యకుంట వద్ద నాలా విస్తరణ, బ్రిడ్జి వెడల్పు పనులను బుధవారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో తలెత్తే ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు నార్త్‌జోన్‌ ట్రాఫిక్‌ ఏసీపీ సంపత్‌కుమార్‌, సీఐలు, ఎస్‌ఎన్‌డీపీ అధికారులు సోమవారం బ్రిడ్జిని సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎన్‌డీపీ డీఈ వశీధర్‌ మాట్లాడుతూ ఎనిమిది నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందన్నారు.

Updated Date - 2022-03-01T12:47:49+05:30 IST