మానవత్వాన్ని చాటుకున్న ట్రాఫిక్‌ పోలీసులు

ABN , First Publish Date - 2022-07-02T16:50:10+05:30 IST

వనస్థలిపురం ట్రాఫిక్‌ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. తండ్రి లేని చిన్నారికి రూ.45వేలు ఫిక్సడ్‌ డిపాజిట్‌ చేశారు. వనస్థలిపురం

మానవత్వాన్ని చాటుకున్న  ట్రాఫిక్‌ పోలీసులు

హైదరాబాద్/మన్సూరాబాద్‌: వనస్థలిపురం ట్రాఫిక్‌ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. తండ్రి లేని చిన్నారికి రూ.45వేలు ఫిక్సడ్‌ డిపాజిట్‌ చేశారు. వనస్థలిపురం ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌లో పద్మమ్మ అనే మహిళ స్వీపర్‌గా పని చేస్తోంది. ఆమె కూతురు నాగమణి భర్త మహేందర్‌ ఇటీవల గుండెపోటుతో మరణించాడు. వారి పేదరికాన్ని గమనించిన ఇన్‌స్పెక్టర్లు పి.లక్ష్మీకాంత్‌, మహే్‌షగౌడ్‌, ఇతర అధికారులు, సిబ్బంది.. కలిసి సహాయం చేయాలనుకున్నారు. ఈ క్రమంలో వారంతా కలిసి రూ.45వేలు జమచేశారు. ఆ నిధులను పద్మమ్మ మనువరాలు కావ్య పేరిట ఫిక్సడ్‌ డిపాజిట్‌ చేసి, దానికి సంబంధించిన పత్రాలను ఆమెకు అందజేశారు. 

Updated Date - 2022-07-02T16:50:10+05:30 IST