ట్రాఫిక్ పోలీసులకు మజ్జిగ పంపిణీ
ABN , First Publish Date - 2022-03-02T15:14:05+05:30 IST
నగరంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీ సులకు మజ్జిగ అందించే పథకాన్ని మంగళవారం పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ ప్రారంభించారు. నగరంలోని ప్రధాన రోడ్డు, కూడళ్లు, మార్కెట్, బస్టాండ్, రైల్వేస్టేషన్
- ప్రారంభించిన కమిషనర్ శంకర్ జివాల్
పెరంబూర్(చెన్నై): నగరంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీ సులకు మజ్జిగ అందించే పథకాన్ని మంగళవారం పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ ప్రారంభించారు. నగరంలోని ప్రధాన రోడ్డు, కూడళ్లు, మార్కెట్, బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రరణకు పోలీసులు విధులు చేపడుతున్నారు. నగరంలో కొద్దిరోజులుగా ఎండ తీవ్రత అధిక మవుతున్న నేపథ్యంలో విధుల్లో ఉన్న పోలీసులకు మధ్యాహ్నం వేళల్లో మజ్జిగ అందించే పథకాన్ని పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ ప్రారం భించారు. ప్రతిరోజు రూ.4.30 లక్షలతో 5 వేల ఆవిన్ మజ్జిగ ప్యాకెట్లు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.