వణికిస్తున్న సీజనల్‌ వ్యాధులు

ABN , First Publish Date - 2022-01-24T05:25:47+05:30 IST

ఓ వైపు కరోనా కేసులు రోజురో జుకూ పెరుగుతుంటే...మరోవైపు సీజనల్‌ వ్యాధులు ప్రజలను వణికుపుట్టిస్తున్నాయి.

వణికిస్తున్న సీజనల్‌ వ్యాధులు
రోగులతో కిటకిటలాడుతున్న ప్రభుత్వాస్పత్రి

 ధర్మవరం, జనవరి 23: ఓ వైపు కరోనా కేసులు రోజురో జుకూ పెరుగుతుంటే...మరోవైపు సీజనల్‌ వ్యాధులు ప్రజలను వణికుపుట్టిస్తున్నాయి. దాదాపు 15రోజుల నుం డి జ్వరాల తీవ్రత అఽధికమై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్ప త్రులు, రక్తపరీక్షా కేంద్రాలు బాధితులతో కిటకిటలా డుతున్నాయి. కుటుం బంలో ఒకరు జ్వరం బారిన పడి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లితే రక్తపరీక్షలకు, మం దులు, వైద్యుడి రుసుం కలిపి దాదాపు రూ.2వేల దాకా వెచ్చించాల్సి వస్తోంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు అప్పుచేసి వైద్యం చేయించు కుంటున్నారు. అప్పులు కూడా పుట్టని వారు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్సలు చేయించుకుంటున్నారు. ప్రతి రోజు ప్రభుత్వాస్పత్రికి దాదాపు 1000 మంది దాకా రోగులు వస్తుంటారు. ప్రస్తుతం కరోనా విజృంబిస్తున్న తరు ణంలో  తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వా ర్డుల్లో వైద్య సిబ్బంది పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి ఫీవర్‌ సర్వే చేసి జ్వరం ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వాస్పత్రికి పంపుతున్నారు. అదే విధంగా పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాలని, మా స్కులు తప్పని సరిగా ధరించాలని, భౌతిక దూ రం పాటించాలని, వేడినీటిని తాగాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 

Updated Date - 2022-01-24T05:25:47+05:30 IST