నగరంలో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం
ABN , First Publish Date - 2020-12-06T02:57:02+05:30 IST
నగరంలో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: నగరంలో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మూడు నెలల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు ఖయ్యూంఖాన్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కలకత్తా, ఢిల్లీ, హైదరాబాద్లో 850 మంది బాధితుల నుంచి రూ.34 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో మోసాలకు పాల్పడ్డ సైనిక్పురికి చెందిన కౌశిక్ బెనర్జీ, రేఖ జాదవ్ అరెస్ట్ చేశారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.