వ్యాపారులూ.. నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2021-05-12T06:48:13+05:30 IST

కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కట్టుబడి ప్రతీఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ అన్నారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలోని మున్సిపల్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన చాంబ ర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశంలో ఆమెమాట్లాడుతూ ప్ర

వ్యాపారులూ.. నిబంధనలు పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ

ఆదిలాబాద్‌ అర్బన్‌, మే 11: కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కట్టుబడి ప్రతీఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ అన్నారు. మంగళవారం మున్సిపల్‌ కార్యాలయంలోని మున్సిపల్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన చాంబ ర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశంలో ఆమెమాట్లాడుతూ ప్రభుత్వం బుధవారం నుంచి లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఉల్లంఘించవద్దని ఉద యం 6 నుంచి 10గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరిచి ప్రజలకు సేవలు అందించాలని ఆ తర్వాత లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలన్నా రు. వ్యాపారులందరు కరోనాకు కట్టుబడి ఉండాలన్నారు. దుకాణాల వద్ద కరోనా నిబంధనలు ప్రజలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఇబ్బందులు కలుగకుండా వ్యాపారులు సేవాభావంతో పని చేయాలని సూచించారు. ఇందులో మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-12T06:48:13+05:30 IST