ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-06-24T04:26:36+05:30 IST
వెలిగండ్ల మండలంలోని గుమ్మలకర్ర గ్రామం వద్ద బుధవారం అతి వేగంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో పూలికుంట్ల గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాయళ్ల తిరుపతయ్య(40) అక్కడికక్కడే మృతి చెందాడు.
వెలిగండ్ల, జూన్ 23 : మండలంలోని గుమ్మలకర్ర గ్రామం వద్ద బుధవారం అతి వేగంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో పూలికుంట్ల గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాయళ్ల తిరుపతయ్య(40) అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు ఎస్ఐ రాజ్కుమార్కు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి ఎస్సై చేరుకున్నారు. మృతదేహాన్ని బోల్తా పడిన ట్రాక్టర్ నుంచి బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కత్తితో దాడి.. ఆరుగురిపై కేసు నమోదు
గుడ్లూరు, జూన్ 23 : మండలంలోని అడవిరాజుపాలెం బీసీ కాలనీలో బుధవారం మొద్దుకత్తిలో ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిన ఘటనలో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అడవిరాజుపాలెం బీసీ కాలనీకి చెందిన గుండ్లపల్లి వెంకటశివాజీ తన పాత ఇంటిని కూల్చి కొత్త ఇంటి నిర్మాణానికై మట్టిని తోలుకుంటుండగా, ఆ ఇంటి వెనుకవైపున నివాసం ఉండే ఆయన దాయాదులు ఆరుగురు కలిసి వివాదానికి దిగారు. ఆ సమయంలో వారు మొద్దుకత్తితో దాడికి చేయడంతో వెంకటశివాజీ తలకు గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం కందుకూరు ఏరియావైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి గుడ్లూరు పోలీ్సలకు అందిన ఫిర్యాదు మేరకు నిందితులు ఆరుగురిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లికార్జున తెలిపారు.