ట్రాక్టర్ బోల్తా : యజమాని మృతి
ABN , First Publish Date - 2021-10-19T06:08:44+05:30 IST
పీలేరు మండలం రేగళ్లు పంచాయతీ బోయపల్లె సమీపంలోని బోడిగుట్ట వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ఓ రైతు మృతి చెందాడు.
పీలేరు, అక్టోబరు 18: పీలేరు మండలం రేగళ్లు పంచాయతీ బోయపల్లె సమీపంలోని బోడిగుట్ట వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ఓ రైతు మృతి చెందాడు. బోయపల్లెకి చెందిన రైతు బాలరాజు (46) రెండు వారాల క్రితం ఒక ట్రాక్టర్ను కొనుగోలు చేశాడు. గ్రామంలోని తన బంధువు అయిన రవి పొలం నుంచి వేరుశెనగ చెట్లను తరలించడానికి సోమవారం వెళుతుండగా మార్గమధ్యంలోని బోడిగుట్ట వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ట్రాక్టర్ ఇంజను రైతు బాలరాజు మీద పడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. గ్రామస్తులు వెంటనే ఎక్స్కవేటర్తో ట్రాక్టర్ను తొలగించి మృతదేహాన్ని వెలుపలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎస్ఐ తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.